Telangana: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ జి.ఓ. ఆర్టి. నం. 202ను జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న Greater Hyderabad Municipal Corporation (జీహెచ్ఎంసీ)ను పునర్వ్యవస్థీకరించి జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది.
మూడు కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం
ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా కొనసాగుతున్న ఆర్.వి. కర్ణన్ అదే పదవిలో పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీకి కమిషనర్గా కొనసాగనున్నారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పనిచేస్తున్న జి. శ్రీజనను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేసింది.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ఉన్న టి. వినయ్ కృష్ణా రెడ్డిని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించింది.

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్
Telangana ఎస్సీడీ విభాగంలో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్న Jyoti Buddha Prakash ను Singareni Collieries Company Limited (ఎస్సీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేసింది.
ఇతర ఐఏఎస్ అధికారుల బదిలీలు
Telangana అమలు విభాగం (Flagship Welfare & Developmental Schemes)లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న Sabyasachi Ghosh కు షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కమిషనర్ బాధ్యతలు అదనంగా అప్పగించింది.
Telangana ఫైనాన్స్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న Sandeep Kumar Sultania కు ప్లానింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (TGRAC) డైరెక్టర్ జనరల్ బాధ్యతలను అదనంగా ఇచ్చింది.
Telangana గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న D Divya ను పీఆర్ & ఆర్డీ కమిషనర్ పోస్టులో ఎఫ్ఏసీగా నియమించింది.
SERP అదనపు సీఈఓగా ఉన్న P Katyayani Devi ను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా బదిలీ చేసింది. ఆమె స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎఫ్ఏసీ బాధ్యతలను కొనసాగించనుంది.
హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న Mayank Mittal ను అదే సంస్థలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేసింది.
ఐటీ, ఇండస్ట్రీస్ & ఎల్ఏ మంత్రికి ఓఎస్డీగా పనిచేస్తున్న U Raghurama Sharma ను ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. అదే సమయంలో ఓఎస్డీ బాధ్యతలను ఎఫ్ఏసీగా కొనసాగించనున్నారు.
పరిపాలనలో కొత్త దశ
హైదరాబాద్ నగర విస్తీర్ణం, జనాభా పెరుగుదల, పరిపాలనా భారం దృష్ట్యా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించడం ద్వారా పౌర సేవలు వేగవంతం కావడం, ప్రాంతాల వారీగా సమర్థ పరిపాలన అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నిర్ణయం రాష్ట్ర రాజధాని నగర పరిపాలనలో కీలక మలుపుగా భావిస్తున్నారు.
