AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. దిల్లీ, తెలంగాణలోనూ ఈ కుంభకోణం జరిగినా.. ఈ స్థాయిలో ఇదివరకెప్పుడూ నిధులు పక్కదారి మళ్లలేదు. ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రెడ్డికి అత్యంత దగ్గరి వాడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కాగా.. త్వరలోనే మరింత మంది కీలక నేతలు అరెస్టు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ లో సీఐడీ పూర్తి వివరాలు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని APSBCL (Andhra Pradesh State Beverages Corporation Ltd) పాలసీలో మార్పులు చేసి, మద్యం సరఫరాలో భాగస్వామ్యం అయిన కంపెనీలను ఎంపిక చేసి, వేల కోట్ల రూపాయలను అక్రమంగా లబ్దిదారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు చార్జిషీట్ వివరాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..
📌 ఈ స్కాం ఎలా మొదలైంది?
2019లో ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వ పాలసీలో మార్పులు చేసి APSBCL ద్వారా మాత్రమే మద్యం విక్రయం జరగాలన్న నిబంధన అమలులోకి తెచ్చారు.
ప్రైవేట్ మద్యం డీలర్లను తొలగించి, సరఫరా బ్రాండ్లను నియంత్రించడానికి OFS (Order for Supply) సిస్టమ్ను తారుమారు చేశారు.
నిబంధనలు మార్చి, కొత్తగా ఏర్పడిన బ్రాండ్లకు అధిక కేసులు విడుదల చేశారు.
మద్యం కంపెనీలు, షెల్ కంపెనీలు, పాలసీ తయారీకి మద్దతిచ్చిన రాజకీయ నాయకులు, అధికారులతో కలిసి కేటాయింపులను ప్రణాళిక ప్రకారం అమలు చేశారు.
ఇందులో భాగంగా కమిషన్లు, కిక్బ్యాక్లు, షెల్ ట్రాన్సాక్షన్ల(ఫేక్ కంపెనీల పేరిట అకౌంట్లు తెరిచి లావాదేవీలు జరపడం) ద్వారా సుమారు రూ.3,300 కోట్లు పక్కదారి పట్టించారు.

👥 ఈ స్కాంలో నిందితులుగా ఉన్న వ్యక్తులు
సిఐడి చార్జిషీట్లో ముఖ్యంగా పేర్కొన్న 17 మంది నిందితుల వివరాలు:
Kesireddy Rajasekhar Reddy – మాజీ ప్రభుత్వ ఐటీ అడ్వైజర్
Pitta Srinivas – పూర్వ బ్యూరోక్రాట్, లిక్కర్ స్కాంలో కీలక ప్లానర్
Muppidi Avinash Reddy – రాజకీయ లింకుల కన్డ్యూయిట్
Sajjala Sridhar Reddy – మాజీ ప్రభుత్వ సలహాదారు
Booineti Chanakya – ప్రభుత్వ పాలసీ తయారీకి కీలక వ్యక్తి
Subbarao – బెవరేజెస్ పాలసీ అమలు అధికారిగా ఉన్నాడు
Ravindra Reddy – అకౌంటింగ్ & ట్రాన్సాక్షన్ల బాధ్యతలో
Mithun Reddy, Chevireddy Bhaskar Reddy, Vijayasai Reddy – పాలసీ మద్దతుదారులు
🏢 ఇందులో పాల్గొన్న కంపెనీలు
📦 డిస్టిలరీ సంస్థలు:
Indospirit Beverages Pvt. Ltd.
Sri Sai Krishna Distilleries
Maruthi Distilleries Pvt. Ltd.
Himalaya Liquor Pvt. Ltd.
🧾 షెల్ కంపెనీలు: (ఫేక్ కంపెనీలు)
Trishul Logistics Pvt. Ltd.
Advayaka Enterprises Pvt. Ltd.
Saanvi Trading Co.
Bluewave Technologies
Amaravati Spirits Pvt. Ltd.
ఈ కంపెనీలకు పెద్ద మొత్తంలో మద్యం సరఫరా ఆర్డర్లు కేటాయించి, ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలారు.
🕵🏻♂️ స్టెప్ బై స్టెప్ స్కాం అమలుః
APSBCL టెండర్లలో చిత్తశుద్ధి లేకుండా కొత్త కంపెనీలను ప్రవేశపెట్టడం.
ప్రభుత్వ పాలసీని మ్యాన్యువల్ ఉత్తర్వులతో వక్రీకరించడం.
పాత బ్రాండ్లను తొలగించి, కొత్త బ్రాండ్లకు అప్రూవల్స్ ఇవ్వడం.
మద్యం సరఫరాకు అవసరమైన కేసుల కంటే అధికంగా OFS కేటాయించడం.
డిస్టిలరీలు షెల్ కంపెనీలుగా నగదు పంపిణీకి వినియోగించడం.
హవాలా మార్గాల ద్వారా నగదు తరలింపు.
ఎలక్షన్ల సమయంలో నగదు పంపిణీకి ఇదే నిధిని వినియోగించడం.
ఆర్థిక లావాదేవీలను బంగ్లాదేశ్, దుబాయ్, సింగపూర్ వరకు విస్తరించడం.
💰 అక్రమ లావాదేవీలు, కమిషన్లు!
షెల్ కంపెనీల ఖాతాల్లోకి వేర్వేరు ఖాతాల నుంచి నగదు ప్రవేశపెట్టారు.
ఆ మొత్తం కిక్బ్యాక్లుగా సంబంధిత రాజకీయ నాయకులకు, అధికారులకు చేరింది.
కొంత భాగం ఆస్తుల కొనుగోళ్లకు, విదేశీ టూర్లకు, పార్టీ ఖర్చులకు వినియోగించారు.

🧾 దర్యాప్తు సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలు
75కి పైగా బ్యాంకు అకౌంట్లు
11 కంపెనీలు పత్రాలపై మాత్రమే ఉనికిలో ఉన్నాయి.
6 కంపెనీలు తమ చిరునామాలను మార్చి మాయమయ్యాయి
రూ.900 కోట్లకు పైగా షెల్ ట్రాన్సాక్షన్లు గుర్తింపు
కమ్యూనికేషన్, ఈమెయిల్స్ ఆధారంగా రాజకీయ ప్రమేయం స్పష్టత
⚖️ చార్జిషీట్పై సెక్షన్లు
IPC 409 – విశ్వాస భంగం
IPC 420 – మోసం
IPC 120B – కుట్ర
PC Act 13(1)(b), 13(2) – అవినీతి నిరోధక చట్టం ప్రకారం చర్యలు
Money Laundering Sections
ఇదే అతిపెద్ద స్కామ్..!
ఈ నిందితులపై నమోదు చేసిన కేసులన్నీ తీవ్రమైనవే. ఇదే కుంభకోణంలో నేరం రుజువు కాకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, కల్వకుంట్ల కవిత, దిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లాంటి కీలక వ్యక్తులు ఇప్పటికే అరెస్టయ్యారు. అయితే, దిల్లీ, తెలంగాణలో జరిగిన మద్యం కుంభకోణానికి కనెక్షన్తోనే ఏపీలోనూ భారీగా దందాకు తెరలేపారు అప్పటి అధికార పార్టీ నేతలు. పూర్తి చట్టాలను మార్చేసి.. అధికారులూ, వైసీపీ నేతలకు సహకరించడం గమనార్హం. పూర్తి ఆధారాలతో ఒక్కొక్కరినీ అధికారులు అరెస్టు చేస్తుండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఉచ్చు బిగుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా వైసీపీకి నిధులు అందినట్లు కీలక ఆధారాలు ఇప్పటికే దొరికాయి. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తప్పించుకోవడమూ సాధ్యమవదంటున్నారు. త్వరలోనే మరిన్ని కీలక అరెస్టులుంటాయని తెలుస్తోంది.
