AP: మ‌రో సంస్థ‌తో ఏపీ స‌ర్కారు ఒప్పందం.. 10వేల ఉద్యోగాలే ల‌క్ష్యం!

AP MOU with tech company

Share this article

AP: విశాఖపట్నంలో ఐటీ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గ్లోబల్ కంపెనీలను ఆకర్షించేందుకు ఏర్పాటు చేస్తున్న జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ సంస్థ ANSR తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఓయు ప్రకారం విశాఖలో భారీ స్థాయిలో టెక్నాలజీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఈ క్యాంపస్ రూపుదిద్దుకోనుంది.

మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జిసిసి మరియు ఐటీ రంగాల్లో మొత్తం 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా ఇప్పటికే మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. “ఏడాదిలోనే ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించగలిగిన మేము, మొదటి విజయం సాధించామని గర్వంగా చెప్పగలుగుతున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.

జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ద్వారా గ్లోబల్ టెక్ కంపెనీలకు అవసరమైన ఆధునిక వర్క్‌స్పేస్‌లు, ఇన్నోవేషన్ సెంటర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫార్ములు అందించనున్నారు. స్థానిక యువతకు టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది మంచి అవకాశమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను టెక్ పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు అభినందనీయంగా మారుతున్నాయి. విశాఖ నగరం ఐటీ, జిసిసి రంగాల్లో కొత్త శకాన్ని ప్రారంభించనుందన్న నమ్మకంతో పరిశ్రమ వర్గాలు ఈ ఒప్పందాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో స్వాగతిస్తున్నాయి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *