FASTAG: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక టోల్ ఏడాదికి రూ.3వేలే!

Toll charges changed

Share this article

FASTAG: దేశంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోన్న తరుణంలో, టోల్ గేట్ల వద్ద ర‌ద్దీ, టోల్ చార్జీల భారం వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా తరచూ ప్రయాణించే వారు టోల్ ఫీజుల వల్ల నెలలో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాహ‌న‌దారుల‌కే కేంద్ర ప్రభుత్వం ఓ శుభ‌వార్త చెప్పింది. వాహనదారులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేలా కేంద్ర రవాణా శాఖ కీలక ప్రకటనను చేసింది. టోల్ ఫీజు భారం తగ్గించడమే కాకుండా, ఫాస్టాగ్‌ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో “ఫాస్టాగ్ పాస్” అనే కొత్త ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. (Fastag Pass)

ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే… దేశ వ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపై అయినా ఏడాదికి 200 ప్రయాణాలు టోల్ ఫ్రీ గా చేసుకునే సదుపాయం ఈ పాస్ ద్వారా అందుబాటులోకి రాబోతోంది. ఇదే విషయాన్ని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. వాహనదారులకు ఇది గుడ్ న్యూస్ అని ఆయన పేర్కొన్నారు.

రూ.3 వేలకే స్పెషల్ ఫాస్టాగ్ పాస్
నితిన్ గడ్కరీ ప్రకారం, వాహనదారులు రూ.3,000 మాత్రమే చెల్లించి ఫాస్టాగ్ పాస్ ను పొందవచ్చు. ఈ పాస్ ద్వారా వారు ఏ నేషనల్ హైవేపైనా టోల్ చార్జీలను చెల్లించకుండానే 200 సార్లు ప్రయాణించవచ్చు. అంటే, మీరు హైదరాబాద్ నుండి బెంగళూరు, హైదరాబాద్ నుండి విజయవాడ, ఢిల్లీ నుండి జైపూర్… ఇలా ఎక్కడికైనా వెళ్లవచ్చు. 200 టోల్ ట్రిప్పులు పూర్తయిన తరువాత మళ్లీ సాధారణ టోల్ చార్జీలు వర్తిస్తాయి.

ఈ పాస్ 2025, ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ఈ సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నారు.

fastag pass

✅ ఎవరి కోసం ఈ పాస్?
ఈ ఫాస్టాగ్ పాస్ కేవలం నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుంది. కార్లు, జీపులు, ఇతర వ్యక్తిగత ప్రయాణ వాహనాలు స‌దుపాయం వాడుకోవ‌చ్చు. కమర్షియల్ వాహనాలకు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. అంటే, టాక్సీలు, బస్సులు, లారీలు, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు దీని పరిధిలోకి రావు.

📌 ప్రయోజనాలు:
ఏంటి లాభం:
తరచూ నేషనల్ హైవే ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా పెద్ద ఊరట.

మొత్తం ఖర్చు తగ్గింపు: ప్రతి ట్రిప్ టోల్ చార్జీకి బదులు, ఏడాదికి ఒక్కసారి మాత్రమే రూ.3,000 చెల్లిస్తే సరిపోతుంది.

స‌మ‌యం క‌లిసొస్తుంది: టోల్ ప్లాజాల వద్ద క్యూ లైన్లు తగ్గే అవకాశం ఉంది.

డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహం: దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ ఉపయోగం మరింత విస్తరించనుంది.

🔍 ఫాస్టాగ్ పాస్ ఎలా పనిచేస్తుంది?
వాహనదారులు ఫాస్టాగ్ సెంటర్లలో లేదా ఆన్‌లైన్‌లో ఈ ప్రత్యేక పాస్‌ను పొందవచ్చు.
ఫాస్టాగ్ పాస్‌లో వాహన నంబర్ లింక్ చేయబడుతుంది.
టోల్ గేట్ల వద్ద స్కానింగ్ సమయంలో, ప్రత్యేక పాస్ ద్వారా టోల్ మాఫీ నేరుగా అమలవుతుంది.
200 ట్రిప్పులు పూర్తి అయిన తరువాత, మళ్లీ సాధారణ టోల్ చార్జీలు వర్తిస్తాయి.

🗓️ ఎప్పటి నుంచీ అమలు?
ఈ ఫాస్టాగ్ పాస్ స్కీమ్ 2025 ఆగస్టు 15 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. కేంద్ర రవాణా శాఖ ప్రణాళిక ప్రకారం, ఈ కొత్త విధానం వల్ల టోల్ ప్లాజాల వద్ద ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని, వాహనదారులకు ఆర్థికంగా మంచి ప్రయోజనం కలుగుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు.

ఈ కొత్త నిర్ణయం దేశంలోని కోట్లాది మంది నాన్ కమర్షియల్ వాహనదారులకు నిజంగా మంచి వార్త. ముఖ్యంగా వారం వారంగా, నెల నెలా హైవే ప్రయాణాలు చేసే కార్ యజమానులకు ఇది పెద్ద గిఫ్ట్ గా చెప్పొచ్చు. టోల్ ఛార్జీల భారం నుంచి బయటపడాలనుకునే వారందరికీ ఇది చక్కటి అవకాశంగా నిలవనుంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *