AP Housing: పేద‌ల‌కు ఉచిత ఇళ్ల స్థ‌లాలు.. రూల్స్ ఇవే!

AP Housing Land

Share this article

AP Housing: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు నివాస‌ భ‌ద్ర‌త క‌ల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నం. 23 ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. ఈ పథకం ద్వారా వేలాదిమందికి సొంతింటి కల నెరవేరనుంది. ఈ కేటాయింపుకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలు, అర్హతలు, నిబంధనలు ఇవే:

అర్హతల వివరాలు:

  • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
  • ఇప్ప‌టికే సొంతింటి స్థ‌లం ఉండి ఉండ‌కూడ‌దు.
  • ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అర్హులు కారు.
  • ఇప్పటికే ఇంటి స్థలం కలిగినవారు (గ్రామీణ ప్రాంతాల్లో 5 సెంట్లు, పట్టణాల్లో 2.5 సెంట్లకు మించి) అర్హులు కారు.
  • చెల్లుబాటు అయ్యే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
  • మున్సిపాలిటీల్లో భూమి లభ్యత ఆధారంగా స్థలం కేటాయించబడుతుంది.
  • స్థలాన్ని అమ్మడం లేదా బదిలీ చేయడం నిషేధం.
  • మైనర్ వయస్సు వారికి స్థలం ఇవ్వబడదు.

భూమి పరిమితి వివరాలు:
గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్లు
పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్లు

ప్రాధాన్యతా క్రమం & ప్రత్యేక నిబంధనలు:
గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యత.
అర్హత కలిగిన మహిళల పేరుమీద స్థలాల కేటాయింపు.
కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి వర్తించుతుంది.

ఆదాయం పరిమితి: గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ₹10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో ₹12,000 లోపు.

కేటాయించిన స్థలంలో 2 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలి.

ప్రక్రియ & పారదర్శకత:

  • జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక.
  • గ్రామ సచివాలయం ద్వారా అర్హతలు పరిశీలన.
  • ఎంపికైన వారి జాబితా గ్రామంలో ప్రదర్శించాలి.
  • అభ్యంతరాలుంటే గ్రామ సభ ద్వారా పరిష్కరించాలి.
  • అవసరమైతే ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి ఖాళీ భూములను సేకరించవచ్చు.
  • లేఅవుట్లు & సర్వేలు అప్రమత్తంగా నిర్వహించాలి.
  • లబ్ధిదారులకు కేటాయింపు పత్రం (పట్టా) ఇవ్వబడుతుంది.

ఈ పథకం ద్వారా నిజంగా అవసరమైన వారికి సొంత స్థలం కల్పించి, గృహ నిర్మాణంలో భాగస్వామ్యమవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అర్హులైన వారు సంబంధిత గ్రామ సచివాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *