AP: వినూత్నం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద త‌ల్లిదండ్రుల స‌మావేశం రేపే!

AP Minister Nara Lokesh

File Photo: Nara Lokesh, AP Minister

Share this article

AP: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మళ్లీ ఓ భారీ అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొనేలా మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 ను జూలై 10న ఉత్సవ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ప్ర‌పంచంలోనే తొలి, అతిపెద్ద పేరెంట్ టీచ‌ర్ మీటింగ్ కావ‌డం విశేషం.

ఈ కార్యక్రమానికి పుట్టపర్తిలోని కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఎం నేరుగా ముఖాముఖి సంభాషించనున్నారు. 61,000 పైగా పాఠశాలల్లో ఒకేరోజు కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఒకేసారి ఈ కార్యక్రమం జరగనుండటం విశేషం.

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా:
74,96,228 మంది విద్యార్థులు
3,32,770 మంది ఉపాధ్యాయులు
1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు
ఇతర భాగస్వాములతో కలిపి 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

పిల్లల చదువులో పురోగతి, ప్రవర్తన, సామాజిక అభ్యాసం వంటి అంశాలపై తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులతో చర్చించుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తోంది. అంతేగాక, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పురోగతి కార్డులు కూడా అందజేయనున్నారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వానికి తెలపడానికి ఇది ఒక దృఢమైన వేదికగా మారనుంది.

AP Minister Lokesh

ప్రైవేటు పాఠశాలల పద్ధతులు – ప్రభుత్వ పాఠశాలల్లో
పేరెంట్‌ టీచర్ మీటింగ్స్ ఇప్పటివరకు కార్పొరేట్ పాఠశాలలకే పరిమితమైనవిగా ఉండేవి. కానీ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షతో ఇప్పుడు ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహించబడుతున్నాయి. గత ఏడాది మొదటిసారి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు రెండో సారి మరింత విస్తృతంగా, శ్రద్ధగా నిర్వహించబడుతోంది.

తల్లిదండ్రుల భాగస్వామ్యం – విద్యకు బలం
తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం ద్వారా విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్రత పెరుగుతుంది. పాఠశాలల మౌలిక వసతులపై, ఉపాధ్యాయుల పనితీరుపై, విద్యార్థుల అభివృద్ధిపై చర్చించేందుకు మెగా పీటీఎం వేదిక అవుతుంది.

పాఠశాలల గోడల్ని దాటి విద్యా చైతన్యాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0 ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మార్పులు కొనసాగడం తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశానికి కూడా ఆదర్శంగా నిలవనుంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *