RBI: మీ దగ్గర ₹2 వేల నోటు ఉందా?

2 thousand notes

Share this article

Hyderabad: దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక శుద్ధి చర్యలలో భాగంగా రద్దైన ₹2వేల నోటుపై తాజాగా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవ‌లె చలామణి నుండి ర‌ద్దు చేసిన‌ ఈ పెద్దనోటు ఇప్పటికీ ప్రజల వద్దే భారీగా మిగిలి ఉందని వెల్లడించింది. ముద్రించిన మొత్తం రూ.2వేల నోట్లలో 98.26 శాతం మాత్రమే తిరిగి బ్యాంకులకు వచ్చాయని, ఇంకా ₹6,181 కోట్ల విలువైన నోట్లను ప్రజలు తమ వద్ద ఉంచుకున్నారని ఆర్బీఐ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

గతంలో రూ.2వేల నోటును రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు విమర్శలు చేసినా, నల్లధనంపై నియంత్రణ సాధించడంలో ఇది ప్రధానంగా ఉపయోగపడుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి, పెద్దనోట్ల చ‌లామ‌ణి తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటూ వస్తోంది.

2017లో ప్రవేశపెట్టిన రూ.2వేల (2 thousand note) నోటును కాలక్రమంలో వాడకానికి తగ్గించుతూ, చివరకు 2023లో అధికారికంగా చెలామణి నుండి తొలగించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు రూ.2వేల నోటును పూర్తిగా తిరిగి పొందలేకపోయిన ఆర్బీఐ, తాజాగా ఈ వివరాలను వెల్లడించింది.

ఇంకా అవ‌కాశ‌ముంది..!
ప్రస్తుతం ఈ నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ప్రజలకు ఇంకా ఉందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2వేల నోట్లను దగ్గరలోని ప్రధాన పోస్టాఫీసులలో మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ మార్పిడి ప్రక్రియకు గడువు ఉందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఆర్బీఐ ప్రకటన ప్రకారం, గతంలో ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకులకు వెళ్లి ఈ నోట్లను మార్చుకున్నప్పటికీ, కొంతమంది నోట్లను దాచుకోవడం లేదా మార్చుకోకుండా ఉండడం వల్లే ఇవి తిరిగి రాలేదని అంచనా వేస్తున్నారు.

నల్లధనం అరికట్టడం, డిజిటల్ చెల్లింపులకు(Digital Payments) ప్రోత్సాహం కల్పించడం, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంపుదల వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇంకా ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య భిన్నంగా ఉండటం, వ్యవస్థలో నల్లధనం లేదా అకౌంటింగ్ లోపాలపై కొత్త చర్చకు దారితీసే అవకాశముంది. ఇకపై ప్రజలు తాము ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవాలని, మరింత ఆలస్యం చేయకుండా పోస్టాఫీసులకు వెళ్లాలని ఆర్బీఐ సూచిస్తోంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *