యూట్యూబ్‌ క్రియేట‌ర్ల‌కు రూ.21వేల కోట్లు!

Share this article

Delhi: గ‌త మూడేళ్ల‌లో యూట్యూబ్ వేధిక‌గా వివిధ కంటెంట్‌ల‌ను రూపొందించి మ‌న భార‌తీయులు సంపాధించిందెంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.21వేల కోట్లు. అవును, నిజ‌మే. ప్ర‌పంచంలోనే ఇది అత్య‌ధికం. కేవ‌లం భార‌తీయుల కంటెంట్‌ను గ‌తేడాది విదేశీయులు 4500 కోట్ల గంట‌ల పాటు చూశార‌ట‌. ఈ విష‌యాల్ని సంస్థ సీఈసీ నీల్ మోహ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఈ ఏడాది కేవ‌లం భార‌త్‌లోనే ఆర్టిస్టులు, మీడియా సంస్థ‌ల అభివృద్ధి కోసం రూ.850 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. భార‌త్‌లోనే దాదాపు 15వేల ఛాన‌ళ్ల‌కు ప‌దిల‌క్ష‌ల‌కుపైగా ఫాలోవ‌ర్లు ఉన్నార‌ని చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లకు మార్గ‌ద‌ర్శిగా మారింద‌న్న నీల్‌.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న ప్ర‌భుత్వాధినేత‌గా మోదీకి అరుదైన గుర్తింపు ద‌క్కింద‌న్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *